CP BROWN GREAT SERVICE TO TELUGU సి పి బ్రౌన్- తెలుగు భాషా సేవ

CP BROWN GREAT SERVICE TO TELUGU


చార్లెస్ ఫిలిప్ Brown తండ్రి డేవిడ్ బ్రౌన్ క్రైస్తవ మత ప్రచారకుడు. క్రైస్తవ మత ప్రచారంలో భాగంగా డేవిడ్ బ్రౌన్ కుటుంబం 1762లో ఇండియా చేరుకుంది. 1798 నవంబరు 10న డేవిడ్ దంపతులకు సీపీ బ్రౌన్ కలకత్తా లో జన్మించారు. తండ్రి మరణానంతరం Brown కుటుంబం తిరిగి ఇంగ్లాండు వెళ్లిపోయింది. 1812లో సీపీ బ్రౌన్ సివిల్ సర్వీసెస్ కు ఎంపికయ్యారు.

ఇంగ్లాండులోని హేల్బరి కళా శాలలో శిక్షణ పొందారు. అనంతరం 1817లో Brown ఉమ్మడి మద్రాస్ రాష్ట్రానికి వచ్చారు. అప్పటికి ఆయనకు తెలుగు రాదు. ఈస్టిండియా కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ఆయనకు ఉద్యోగ విధుల్లో భాగంగా తెలుగు నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Brown తొలిసారి తెలుగుభాష :

1817 ఆగస్టు 17న తొలిసారి తెలుగుభాష గురించి విన్నారు. తెలుగు జాతికి సేవ చేసిన నలుగురు ఆంగ్లేయులలో ఒకరిగా Brown ను పరిగణిస్తారు. మిగతా ముగ్గురి పేర్లు ఆర్థర్ కాటన్, కాలిన్ మెకెంజి, థామస్ మన్రోలు. ఆంధ్ర భాషోద్ధారకుడు అని గౌరవించబడిన మహానుభావుడు.వేమన పద్యాలను సేకరించి, ప్రచురించి, ఆంగ్లంలో అనువదించి ఖండాంతర వ్యాప్తి చేశాడు.

తొలిరోజుల్లో వెల గపూడి కోదండరామయ్య పంతులు వద్ద Brownతెలుగు ఆ భాష నేర్చుకున్నారు. 1820 ఆగస్టులో కడప డిప్యూటీ కలె క్టరుగా చేరారు. బ్రౌన్ కడపకు రాకముందు ఆయనకు తెలుగు కంటే హిబ్రూ, పార్కీ, గ్రీకు, లాటిన్ భాషలు బాగా తెలుసు. కృషి, పట్టుదలతో తెలుగును నేర్చుకున్నారు. 1824 నాటికి, తెలుగుకావ్యాలు చదివి అర్థం చేసుకునే స్థాయికి వచ్చారు.

Brown వేమన పద్యాలు :

వేమన పద్యాలను సేకరించి పుస్తకంగా ముద్రించారు. ‘ద వర్సెస్ ఆఫ్ వేమన’ పేరిట వీటిని ఇంగ్లీ ములో ప్రచురించారు.సొంత డబ్బు వెచ్చించి సాహిత్య శోధన… కడప అప్పట్లో ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉండేది. బ్రౌన్ కొన్నాళ్లు ఇక్కడ పనిచేసిన తర్వాత చిత్తూరు, గుంటూరు, మచిలీపట్నం, తిరునల్వేలి ప్రాంతాలకు వెళ్లారు.

మళ్లీ 1826లో కడపకు వచ్చారు. Brown తెలుగు భాషపై పరిశోధనలు చేశారు. ప్రాచీన సాహిత్య సేకరణ. తాళపత్ర గ్రంథాల పరిష్కరణకు నడుం బిగించారు. వీటిని సేకరించి, వ్యాఖ్యానాలు రాసేందుకు పండితులను నియ మించుకున్నారు. వీరికి సొంత డబ్బులు ఇచ్చేవారు. ఒకర కంగా జీతం మొత్తం తెలుగు భాషా సేవకే వెచ్చించారు.

జీతం సరిపోక అప్పులు కూడా చేశారని అంటారు. అలా పరిష్కరించిన వాటిని Brown ముద్రించేవారు. బ్రౌనే లేకుంటే..మనుచరిత్ర, రంగనాథ రామా యణం, పాండితారాధ్య చరిత్ర, దశావతార చరిత్ర లాంటి కావ్యాలు బ్రౌన్ కృషివలనే మనకు అందుబాటులోకి వచ్చాయి. 1844లో వసుచరిత్ర, 1851లో మనుచరిత్ర ప్రచురిం చారు.

జాలూరు అప్పయ్యశాస్త్రి చేత వీటికి వ్యాఖ్యానాలు రాయిం చారు. 1852లో పల్నాటి వీరచ రిత్ర పుస్తకం ప్రచురించారు.తెలుగు- ఇంగ్లీషు, ఇంగ్లీషు-తెలుగు నిఘంటువులు రూపొందించారు. ఇప్పటికి చేప Brown మరియు వులు అందుబాటులో ఉన్నారు. వీటితో పాటు ఏ గ్రామర్ అఫ్ తెలుగు లాంగ్వేజ్ ప్రచురించారు.


శతకాలు, వచన కావ్యాలు, చింపిన కావ్యాల లకు ప్రాణం చేశారు. అందనిలోని ఇండియన్ హౌన్ లైబ్రరీలో ఉన్న దాదాపు రెండువేల దక్షిణభారత్ “గ్రంధాలను మద్రాసు తెప్పిం “చారు. 1854లో ఉద్యోగ విరమణ అనంతరం ఆయన తిరిగి అందు పోయిలు అక్కడే స్థిరపడ్డారు. 1940ల్లో లండ స్ యానివర్సిటీలో తెలుగు ప్రొఫెక్టల్గా చేరారు.ఎన్నో పోస్ట్‌లు మరియూ బ్లాగులు ఇంటర్నెట్ లో చూడచ్చు.


కడపలో సీపీ Brown గ్రంథాలయం:


డిప్యూటీ కలెక్టర్గా సీపీ Brown పలు ప్రాంతాల్లో పనిచేసినా. ఆయన కడ పలో ఎక్కువకాలం ఉన్నారు. ఆయన చనిపోయిన దాదాపు వందేళ్ల తర్వాత |కడపలో సీపీ Brownసేవలను వెలుగులోకి తెచ్చేందుకు జానమద్ది హనుమ చ్చాస్త్రి రంగంలోకి దిగారు. బ్రౌన్ తెలుగు భాషకు ఆకుంఠిత దీక్షతో ఎలా అయితే శ్రమించారో.. జానమద్ది కూడా ఎంతగానో శ్రమించి కడపలో బ్రౌన్ గ్రంథాలయం ఏర్పాటుచేశారు.

ఆయన కడపలో నివసించిన బంగ్లా ఉన్న స్థలం లో ఇప్పుడు పీపీ Brown గ్రంథాలయం ఉంది. ఇక్కడ ఎన్నో సాహిత్య పుస్తకాలతో పాటు తాళపత్ర గ్రంథాలు, విజ్ఞాన సంపద నిక్షి “ప్తమై ఉంది. 1840లో
భాగవతాన్ని ప్రాన్స్ స్యయంగా ముద్రిం “వారు. 1913లో హయగ్రీవ శాస్త్ర పూర్వ భాగ

Brownసేవలు వెలకట్టలేనివి తెలుగు భాషా సేవలో జీవితాన్ని తరింపజేస్తు కున్న గొప్ప భాషా సేవకులు సీపీ బ్రౌన్. ఆంగ్లే యుడుగా పుట్టినా తన జీవితాన్ని, జీతాన్ని తెలు గుభాషా సాహిత్యాల పునరుద్ధరణకు వెచ్చిం చారు. బ్రౌన్ గొప్పతనాన్ని కొలవడానికి కొలమా నాలు లేవు.

వేమన కవిత్వంలోని సామాజిక రుగ్మత లను తొలగించే లక్షణం చూసి Brown ఆశ్చర్యపోయారు. లభ్యమవుతున్న తాళపత్ర గ్రంథాలు చాలా మటుకు బ్రౌన్ సేకరించినవే. దేశం నలుచెర గుల నుంచి వీటిని తెప్పించి భద్రపరిచారు. పండితుల చేత వాటిని పరిష్క రించి కాగితాలపై రాయించి ఆంధ్ర సాహిత్య లక్ష్మీకి బాగ్య భాండాగారం ఏర్పరిచారు. ఆ దొర లేకుంటే చెదలు పట్టి ఆంధ్ర గ్రంథాలు ఏమయ్యేవో.

కడపలోను, మచిలీపట్నంలోను కూడా పాఠశాలలు పెట్టి ఉచితంగా చదువు చెప్పించాడు. విద్యార్థులకు ఉచితంగా భోజనవసతి కూడా కల్పించాడు. దానధర్మాలు విరివిగా చేసేవాడు. వికలాంగులకు సాయం చేసేవాడు. నెలనెలా పండితులకిచ్చే జీతాలు, దానధర్మాలు, పుస్తక ప్రచురణ ఖర్చుల కారణంగా బ్రౌను ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు. అప్పులు కూడా చేసాడు. 

1834లో ఉద్యోగం నుండి తొలగించడంతో ఇంగ్లండు వెళ్ళిపోయి, తిరిగి 1837లో కంపెనీలో పర్షియను అనువాదకుడిగా ఇండియా వచ్చాడు. బ్రౌను మానవతావాది. 183233లో వచ్చిన గుంటూరు కరువు లేదా డొక్కల కరువు లేదా నందన కరువు సమయంలో ప్రజలకు బ్రౌను చేసిన సేవలు ప్రశంసలందుకున్నాయి.

ఆ సమయంలో కరువును కరువుగా కాక కొరతగా రాయాలని అధికారులు చెప్పినా, కరువుగానే పేర్కొనడంతో వారి అసంతృప్తిని ఎదుర్కొన్నాడు. పందొమ్మిదో శతాబ్ది తొలిపాదం చివర్లో తాను తెలుగు సాహిత్యంలో కృషి మొదలుపెట్టేనాటికి నెలకొని వుండిన స్థితిగతులను గురించి బ్రౌన్ స్ఫుటమయిన మాటల్లో అభివర్ణించాడు. ‘అప్పటికి తెలుగు సాహిత్యం కొనప్రాణంతో కొట్టుకులాడుతోంది.

1825 నాటికి ప్రమిదలో దీపం కొడిగట్టిపోతోంది. తెలుగు సాహిత్యం దాదాపు అంతరించిపోతూ ఉండడం నా కళ్లబడింది. నేను 30 ఏళ్లు కృషి చేసి, దాన్ని పునఃప్రతిష్ట చేశాన’న్నాడు బ్రౌన్. నిరలంకారంగా మాట్లాడ్డం బ్రౌన్ శైలి. ఈ మాటల్లో కూడా అందుకే అతిశయోక్తులు కనిపించవు. 1827 నాటికే, బ్రౌన్ ‘ఆంధ్ర గీర్వాణ ఛందము’ అనే పుస్తకం రాసినప్పటికీ, ఆయనకి మంచి గుర్తింపు తెచ్చిన పుస్తకం 1829 నాటి ‘వేమన శతకం’.